దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకొని మళ్ళీ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో మంచు మనోజ్ హీరో గా ‘అహం బ్రహ్మస్మి’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అయితే ఇంత వరకూ షూటింగ్ ప్రారంభించలేదు కానీ.. సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ మాత్రం రిలీజ్ చేసేశారు. రెండిటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. గ్యాప్ తీసుకున్నా మనోజ్ మాత్రం మంచి కథతో వస్తున్నాడన్న హోప్స్ పెంచాడు. ఇక ఈ సినిమా రేపు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి మనోజ్ కు క్లోజ్ ఫ్రెండ్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిథిగా రానున్నాడు. రేపు ఉదయం 8 గంటలకు ఫిల్మ్ నగర్ దైవసన్నిధానంలో జరగనున్న ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇక ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు మనోజ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Love you Mithrama ❤🤗#AB #AhamBrahmasmi #RamCharan pic.twitter.com/UlWGCYgdZ0
— MM*🙏🏻❤️ (@HeroManoj1) March 5, 2020
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాను ఎంఎం ఆర్ట్స్ బ్యానర్పై విద్యా నిర్వాణ, మంచు ఆనంద్ సమర్పణలో మంచు మనోజ్, నిర్మలాదేవి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: