`వెంకి మామ`, `ప్రతి రోజూ పండగే`, `అల వైకుంఠపురములో`… ఇలా వరుస విజయాలతో ముందుకు సాగుతున్నాడు యువ సంగీత సంచలనం థమన్. మరీ ముఖ్యంగా.. `అల వైకుంఠపురములో`తో స్వరకర్తగా మరో స్థాయికి ఎదిగాడు ఈ టాలెంటెడ్ కంపోజర్. కట్ చేస్తే… `అల వైకుంఠపురములో` నిర్దేశకుడు, సెల్యులాయిడ్ తాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న కొత్త చిత్రానికి కూడా బాణీలు అందించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడట థమన్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… `అరవింద సమేత` తరువాత యంగ్ టైగర్ యన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తారక్ 30వ చిత్రంగా రూపొందనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ మే నెలలో మొదలై 2021 ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. కాగా, ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా థమన్ ఎంపికయ్యాడని సమాచారం. త్రివిక్రమ్ గత చిత్రాలు `అరవింద సమేత`, `అల వైకుంఠపురములో`కి థమన్ అందించిన బాణీలు ప్లస్ కావడంతో… తననే పునరావృతం చేస్తున్నాడట మాటల మాంత్రికుడు. త్వరలోనే థమన్ ఎంట్రీపై ఫుల్ క్లారిటీ వస్తుంది.
[custom_ad]
అన్నట్టు.. తారక్ కాంబినేషన్ లో `బృందావనం`, `బాద్ షా`, `రామయ్యా వస్తావయ్యా`, `రభస`, `అరవింద సమేత` చిత్రాలకు స్వరాలు అందించాడు థమన్. వీటిలో `రామయ్యా వస్తావయ్యా`, `రభస` మినహా మిగిలిన మూడు చిత్రాలు విజయపథంలో పయనించాయి. సో… తారక్ తో ఆరోసారి, త్రివిక్రమ్ తో మూడోసారి థమన్ కలసి పనిచేయనున్నాడన్నమాట.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: