మొత్తానికి శింబు ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ‘మానాడు’ సినిమాపై క్లారిటీ వచ్చింది. గతకొద్ది కాలంగా ఈ సినిమాపై పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ బ్యానర్లో తెరకెక్కించాలని చాలా రోజుల కిందటే ప్రయత్నాలు జరిగినా.. శింబు, గౌతమ్ల మధ్య వివాదాల కారణంగా ఆ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్గా మరో నిర్మాతతో వెంకట్ ప్రభు దర్శకత్వంలో మానాడు సినిమా పట్టాలెక్కుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిజానికి ఈ ‘మానాడు’ సినిమాను ప్రకటించి చాలా రోజులే అయింది. ఎంతకీ పట్టాలెక్కకపోవడంతో ప్రాజెక్ట్ ఇక లేదని అనుకున్నారు. కానీ ఇటీవలే ఈ చిత్ర నిర్మాత సురేష్ కామాక్షి ఈ సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్తున్నామని ప్రకటించాడు. ఇక ఈ రోజు ఫైనల్ గా ఈ సినిమాను స్టార్ట్ చేశారు. పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు.
[custom_ad]
ఈ సినిమాలో శింబుకు జోడిగా కళ్యాణీ ప్రియదర్శన్ నటిస్తుండగా ఎస్ఏ చంద్రశేఖర్, భారతీరాజా, ప్రేమ్జీ అమరన్, కరుణాకరన్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో శింబు ఓ ముస్లిం యువకుడి పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: