తమిళ్ టాలెంటెడ్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో తమిళ ప్రాచీన యుద్ధ విద్య ఆడిమురై నేపథ్యంగా తెరకెక్కిన సినిమా ‘పటాస్’. ఆర్.ఎస్.సెంథిల్ దురైకుమార్ దర్శకత్వంలో సత్యజ్యోతి ఫిలింస్ నిర్మించిన ఈ సినిమాలో స్నేహ, మెహ్రిన్ హీరోయిన్లుగా నటించగా.. నవీన్ చంద్ర విలన్ గా నటించాడు. ఈ సినిమాకు వివేక్-మర్విన్ సంగీతం అందించాడు. గత నెలలో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘లోకల్ బోయ్’ అనే టైటిల్ తో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. తెలుగులో విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్పై సీహెచ్ సతీష్కుమార్ అందిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 28వ తేదీన ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. మరి తమిళ్ లో హిట్ అయిన సినిమా తెలుగులో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం.
[custom_ad]
ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో డీ 40 పేరుతో ఓ చిత్రం చేస్తున్నాడు ధనుష్. దీనితో పాటు మరో సినిమాను సెల్వరాజ్ డైరెక్షన్లో చేస్తున్నాడు. ఈ చిత్రానికి కర్ణన్ అనే పేరు పెట్టారు. కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాలీవుడ్ నటి రజిష విజయన్ హీరోయిన్ గా నటిస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: