సహాయ నటిగా కెరీర్ ని మొదలుపెట్టిన హైదరాబాదీ భామ రీతూ వర్మ.. అనతి కాలంలోనే కథానాయికగా తనదైన ముద్ర వేసింది. మరీ ముఖ్యంగా… `పెళ్ళి చూపులు`తో రీతూ ఓవర్ నైట్ స్టార్ అయిపోవడమే కాదు, `ఉత్తమ నటి`గా ప్రతిష్ఠాత్మక `నంది` పురస్కారాన్ని కూడా అందుకుంది. అయితే, ఆ తరువాత మాత్రం రీతూ స్థాయికి తగ్గ అవకాశాలు దక్కలేదనే చెప్పాలి. మధ్యలో `కేశవ` లాంటి చిత్రాల్లో సందడి చేసినా ఫలితం శూన్యం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఈ నేపథ్యంలో.. తమిళ చిత్రసీమ బాట పట్టింది రీతూ. అక్కడ విక్రమ్ తో `ధ్రువ నక్షత్రం`, దుల్కర్ సల్మాన్ తో `కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాల్` చిత్రాలు చేసింది. ఈ ఏడాదిలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ తెరపైకి రాబోతున్నాయి. అంతేకాదు.. తెలుగులోనూ వరుస చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే శర్వానంద్ సరసన పేరు నిర్ణయించని ద్విభాషా చిత్రంలో నటిస్తున్న రీతూ.. నానికి జోడీగా `టక్ జగదీష్`లో నటిస్తోంది. అలాగే తాజాగా నాగశౌర్యకి జంటగా నటిస్తున్న సినిమా కూడా పట్టాలెక్కింది. మరి… 2020లోనే వస్తున్న ఈ ఐదు చిత్రాలతోనైనా రీతూ దశ, దిశ మారుతాయేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: