చిన్న కథలుగా వచ్చి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి పెద్ద హిట్ కొట్టిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అలానే స్ట్రాంగ్ కంటెంట్ తో వస్తున్న చిన్న సినిమా ‘ఓ పిట్టకథ’. విశ్వంత్, సంజయ్ రావు, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ ప్రధాన పాత్రధారులుగా.. చెందు ముద్దు దర్శకుడిగా పరిచయం అవుతూ ఈ సినిమా వస్తుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇప్పటీకే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చేతుల ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా.. రానా దగ్గుబాటి ప్రీ-టీజర్ ను రిలీజ్ చేశారు. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు తన చేతుల మీదుగా టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి మొదటి పాటను రిలీజ్ చేశారు. ”బుట్ట బొమ్మ” పూజా హెగ్డే చేతుల మీదుగా ” ఏమై పోతానే” అన్న మొదటి పాటను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Happy to share the first lyrical #EmaiPothane from #OPittaKatha, which I liked instantly. Wishing entire team a very good luck.
👉https://t.co/8Ytd0Tr2tG@SanjayKOfficial @NityaMShetty @actorbrahmaji @chendumuddhu#PraveenLakkaraju #Sreejo @BhavyaCreations
— Pooja Hegde (@hegdepooja) February 14, 2020
[custom_ad]
ఇంకా ఈ చిత్రంలో, శ్రీనివాస్ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి తదితరులు నటిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనందప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని మార్చిలో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: