సమంత తాను ఇంట్లో వుండే నేను లేనని చెప్పించినా… శర్వా తాను చేయగలనా అని ఆలోచించినా నన్ను నమ్మండి అని వారికీ భరోసా ఇచ్చి మరీ సినిమాను రీమేక్ చేసాడు దిల్ రాజు. ఇంతకీ ఆ సినిమా ఏంటో స్ట్రైక్ అయివుంటుంది కదా. అదే ’96’ రీమేక్ జాను. తమిళ్లో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన క్లాసిక్ ప్రేమకథ ‘96′. ఇక ఈ సినిమాను తెలుగులో ‘జాను’ పేరుతో రీమేక్ చేశారు. శర్వానంద్, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మించగా, సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 7న (శుక్రవారం) విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా చూసిన వారు శర్వా, సమంతలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సమంత, శర్వానంద్ లు తమ నటనతో మెప్పించారని అంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ప్రశంసలు కురిపించారు. ” ప్రేక్షకుల ఆదరణ పొందిన ఒక సినిమాను రీమేక్ చేయడం అంత ఈజీ కాదు.. కానీ శర్వానంద్, సమంత చాలా ఎఫర్ట్ లెస్ గా చేశారు.. ఈ సినిమా మంచి సక్సెస్ అయినందుకు మీకు కంగ్రాట్స్ అంటూ” సోషల్ మీడియాలో తన అభినందనలు తెలిపారు.
[custom_ad]
ఇక ప్రస్తుతం శర్వానంద్ ‘శ్రీకారం’ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది. ఇందులో రైతు పాత్రలో కనపడతాను. రైతు కొడుకు రైతు ఎందుకు కాకూడదు? అనే పాయింట్ను ఆధారం చేసుకొని ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. అన్ని పనులు త్వరలో పూర్తి చేసి ఏప్రిల్ లో ఈ సినిమా విడుదల చేయాలని చూస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: