మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బడా మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్`తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ రాజమౌళి రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. కాగా, ఏప్రిల్ లేదా మే నాటికి చరణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో.. చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. `మళ్ళీ రావా`, `జెర్సీ` చిత్రాల దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చెర్రీ తదుపరి సినిమా ఉంటుందని తెలిసింది. ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తారని ప్రచారం సాగుతోంది. త్వరలోనే చరణ్ – గౌతమ్ కాంబినేషన్ మూవీపై మరింత క్లారిటీ వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇదిలా ఉంటే.. గౌతమ్ తిన్ననూరి ప్రస్తుతం `జెర్సీ` హిందీ రీమేక్ తో బిజీగా ఉన్నాడు. షాహిద్ కపూర్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా.. ఆగస్టు 28న రిలీజ్ కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: