అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ హీరోగా వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఈ సంక్రాంతికి రిలీజయ్యి ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ మళ్ళీ వంశీ పైడిపల్లి తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మహేష్ కూడా హాలీడే ట్రిప్ వున్నాడు. మూడు నెలలు బ్రేక్ తీసుకొని ఆ తర్వాత మే నుండి ఈ సినిమాను ప్రారంభించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాలో మహేష్ రోల్ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. మహేష్ ఈ సినిమాలో జేమ్స్ బాండ్ రోల్ తరహాలో పూర్తి యాక్షన్ పాత్రలో నటించబోతున్నారట. అలాగే ఈ సినిమా పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా ఉండబోతోందని, ప్రత్యేకంగా క్రేజీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వంశీ పైడిపల్లి రూపొందించినట్లు తెలుస్తోంది. చూద్దాం మరి ఇందులో ఎంత నిజముందో.
ఇక వంశీ, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన ‘మహర్షి’ ఎంత సూపర్ హిట్ అయిందో తెలుసు. మరి ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: