2014 లో నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన కార్తికేయ అనే సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ కార్తికేయ సినిమా సీక్వెల్ కార్తికేయ2 తెరకెక్కనుంది. ఇక ఈ సినిమా షూటింగ్ ని జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభించాలని చూస్తున్నారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో పలువురి పేర్లే వినిపించాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను తీసుకున్నట్లు ఆ మధ్యలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
[custom_ad]
కాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్, ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల గురించి తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. మరి చందు గత ఏడాది తెరకెక్కించిన సవ్యసాచి బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఈసారి ఎలాగైనా మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కాలని చూస్తున్నారు. ఈ సినిమాతో తిరిగి మళ్ళీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: