సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ “భరత్ అనే నేను “మూవీ తో కియారా అద్వానీ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జోడిగా నటించిన “వినయ విధేయ రామ ” మూవీ నిరాశపరిచింది. ఆ మూవీ తరువాత కియారా అద్వానీ తెలుగు లో నటించలేదు. బాలీవుడ్ లో బిజీ అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన సెన్సేషనల్ హిట్ “అర్జున్ రెడ్డి ” మూవీ హిందీ రీమేక్ “కబీర్ సింగ్ ” మూవీ లో హీరోయిన్ గా నటించిన కియారా అద్వానీఆ మూవీ ఘనవిజయంతో బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారారు. కియారా అద్వానీ నటించిన హిందీ మూవీ “గుడ్ న్యూస్ ” ఘన విజయం సాధించింది. బ్లాక్ బస్టర్ “మహర్షి”మూవీ తరువాత వంశీ పైడిపల్లి, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కనున్న #SSMB 27 మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించనున్నారని సమాచారం. అదే నిజమయితే “భరత్ అనే నేను” మూవీ తో ప్రేక్షకులను అలరించిన జంట మహేష్ బాబు, కియారా అద్వానీ మరో సారి ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: