భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా పాన్-ఇండియా ప్రాజెక్టుల హవా సాగుతోంది. దక్షిణాది సినిమాలే కాదు ఉత్తరాది చిత్రాలు కూడా అన్ని ప్రధాన భాషల్లో రిలీజ్ అవుతూ… పాన్-ఇండియా స్టేటస్ తో సందడి చేస్తున్నాయి. `బాహుబలి` సిరీస్ తో ఈ తరహా చిత్రాలకు ఊపు రాగా… తెలుగునాట `సాహో`, `సైరా` వంటి ప్రతిష్ఠాత్మక చిత్రాలు కూడా అదే బాట పట్టాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇదిలా ఉంటే… తెలుగునాట తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అదే తరహాలో ఓ సినిమా చేయబోతున్నారట. ఆ వివరాల్లోకి వెళితే.. `పింక్` రీమేక్ తో రీ-ఎంట్రీ బాట పట్టిన పవన్.. ఆపై టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో ఓ పిరియాడికల్ మూవీ చేయబోతున్నారని టాక్. ఈ నెల 27న ప్రారంభం కానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పాన్-ఇండియా మూవీగా రిలీజ్ కానుందని సమాచారం. ఇందులో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో దర్శనమివ్వనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం నిర్మించనున్న ఈ సినిమాకి సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
[custom_ad]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: