అల్లు అరవింద్ కు ‘ఛాంపియన్స్ ఆఫ్ ఛేంజ్ 2019’ పురస్కారం దక్కిన విషయం తెలిసిందే. సామాజిక అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నందుకుగాను కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు చాంపియన్స్ ఆఫ్ చేంజ్ పురస్కారాన్ని అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ అవార్డు ఈసారి అల్లు అరవింద్ కు దక్కింది. సినీ రంగానికి విశేష సేవలందించినందుకు గాను అరవింద్ కు ఈ అవార్డును అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఈ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ పురస్కారాన్ని అల్లు అరవింద్ కు ప్రదానం చేశారు.
[custom_ad]
ఇక అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాప్ ప్రొడ్యూసర్స్ లో అల్లు అరవింద్ కూడా ఒకరన్న విషయం అందరికీ తెలుసు. గీతా ఆర్ట్స్ అనే బ్యానర్ ద్వారా ఈయన ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఇంకా అందిస్తూనే వున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: