జాన్వీ కోసం ముంబైకే మకాం మార్చిన పూరీ..!

Puri Jagannadh Goes To Mumbai

ప్రస్తుతం విజయ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే సినిమా బిజీలో వున్నాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లి లీట్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఫిబ్రవరి లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ సినిమా రాబోతున్న సంగతి కూడా తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్ గా కనిపించనున్నాడట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను తీసుకోవాలని పూరీ డిసైడ్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పూరీ జాన్వీ ని అడగటం.. జాన్వీ ఓకే చెప్పడం జరిగిపోయింది. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ప్రస్తుతం వరుస సినిమాలు ఉండటంతో డేట్లు అడ్జస్ట్ కాక ఈ సినిమా నుండి తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి.

అయితే పూరీ మాత్రం జాన్వీనే ఫిక్స్ అవ్వడంతో ఓ నిర్ణయానికి వచ్చాడట. ఈ నేపథ్యంలో షూటింగ్ మొత్తాన్ని హైదరాబాద్ నుంచి ముంబైకి మార్చేసినట్టు తెలుస్తుంది. ఫిబ్రవరిలో జాన్వీ నటించనున్న తక్త్ షూటింగ్ ప్రారంభం కానుంది. ముంబైలో ఈ సినిమా షూటింగ్ కు కరణ్ జోహార్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడైతే జాన్వీ అందుబాటులో ఉంటుందని పూరీ ప్లాన్ వేసాడట. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − seven =