గీతా ఆర్ట్స్, హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “అల .. వైకుంఠపురములో … ” మూవీ జనవరి 12 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. చాలా కాలం గ్యాప్ తరువాత సీనియర్ హీరోయిన్ టబు ఒక కీలక పాత్రలో నటించారు. సుశాంత్, నవదీప్, నివేత పేతురాజ్ , రాజేంద్ర ప్రసాద్, సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ , సాంగ్స్ కు విశేష స్పందన లభించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“అల .. వైకుంఠపురములో … ” మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో 6వ తేదీ ఒక మ్యూజికల్ కాన్సర్ట్ ను మేకర్స్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సందర్భంగా టబు మాట్లాడుతూ … చాలా సంవత్సరాల తరువాత తెలుగు మూవీ లో నటించానని, దర్శకుడు త్రివిక్రమ్, అల్లు అర్జున్, అల్లు అరవింద్, సుశాంత్ , అందరూ కుటుంబ సభ్యులుగా మారిపోయారని, 10 ఇయర్స్ తరువాత తెలుగు మూవీ లో నటించానని, ఈ మూవీ కంటే గొప్పగా రీ ఎంట్రీ ఇవ్వలేనేమో నని, “అల .. వైకుంఠపురములో … ” మూవీ టీమ్ కు కృతజ్ఞతలని, ప్రేక్షకుల ఆశీస్సులతో మరిన్ని తెలుగు మూవీస్ లో నటిస్తానని టబు తెలిపారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: