బ్లాక్ బస్టర్ “ఛలో ” మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన కన్నడ బ్యూటీ రష్మిక “గీత గోవిందం ” మూవీ ఘనవిజయంతో స్టార్ డమ్ పొందారు. పలు మూవీ కమిట్ మెంట్స్ తో రష్మిక బిజీగా మారారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తో రష్మిక జంటగా నటించిన “సరిలేరు నీకెవ్వరు మూవీ జనవరి 11వ తేదీ రిలీజ్ కానుంది. యంగ్ హీరో నితిన్ కు జోడీ గా నటించిన “భీష్మ ” మూవీ ఫిబ్రవరి 21 వ తేదీ రిలీజ్ కానుంది. స్టైలిష్ స్టార్
అల్లుఅర్జున్ తో రష్మిక జతకట్టిన “AA 20” మూవీ సెట్స్ పై ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ధృవ సర్జా హీరో గా రూపొందుతున్న కన్నడ మూవీ “పొగరు ” లో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నారు. కార్తీ హీరోగా రూపొందనున్న తమిళ మూవీ “సుల్తాన్ ” తో రష్మిక కోలీవుడ్ లో అడుగు పెడుతున్నారు. ఇలా పలు ప్రాజెక్ట్స్ తో రష్మిక బిజీగా ఉన్నారు. తన అందం, అభినయం తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్న రష్మిక రీసెంట్ గా తన ఫ్యాన్స్ తో సోషల్ మీడియా లో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా యంగ్ రెబెల్
స్టార్ ప్రభాస్, యువ సామ్రాట్ నాగ చైతన్య లతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనే కోరికను రష్మిక వెల్లడించారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: