సోషల్ మీడియా వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉంటుందో తెలియదు కానీ.. సెలెబ్రిటీస్ కు మాత్రం సోషల్ మీడియా వల్ల కాస్త ఇబ్బందులు ఎక్కువే అని చెప్పొచు. వాళ్ళు పొరపాటున ఏం చిన్న పని చేసినా అంతే.. కామెంట్స్ మీద కామెంట్స్ చేయడానికి రెడీగా ఉంటారు. ఈ సోషల్ మీడియాకు బలైన సెలబ్రిటీస్ ఎంతో మంది వున్నారు. కొందరు చూసి చూసి ఆ తర్వాత లైట్ తీసుకుంటున్నారు. కొంతమంది మాత్రం అప్పుడప్పుడు స్పందిస్తున్నారు. ఇప్పుడు ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటారా..!
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అసలుసంగతేంటంటే.. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేసాడు అల్లు శిరీష్. ఓ ట్విట్టర్ అకౌంట్ ద్వారా చిరంజీవి, అల్లు అర్జున్ ల మీమ్స్ పోస్టు చేస్తుండడం పట్ల అల్లు శిరీష్ ఘాటుగా స్పందించినట్టు తెలుస్తోంది.ఫేక్ స్క్రీన్ షాట్లు పోస్టు చేస్తూ, తప్పుడు ప్రచారం చేయడాన్ని ఆపేయాలని విజ్ఞప్తి చేశారు. అలాంటి పోస్టులు పెడితే న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోనని స్పష్టం చేశారు. అయితే శిరీష్ స్పందించిన వెంటనే.. సదరు నెటిజన్ ఆ పోస్ట్ను తొలగించాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: