కొద్దిసేపటి క్రితం వరకు ఫిల్మ్ నగర్ వర్గాలలో నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. “సరిలేరు నీకెవ్వరు- అల వైకుంఠపురంలో” చిత్రాలు రెండూ జనవరి 11న క్లాష్ అవుతున్నాయి అన్న వార్త నేపథ్యంలో నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న చొరవ సత్ ఫలితాన్ని ఇచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ మేరకు దిల్ రాజు ఆఫీస్ లో కొద్దిసేపటి క్రితం జరిగిన ప్రెస్ మీట్ లో ప్రొడ్యూసర్స్ గిల్డ్ పక్షాన ప్రముఖ నిర్మాత కే.ఎల్. దామోదరప్రసాద్ మాట్లాడుతూ” రెండు చిత్రాలు ఒకే రోజు విడుదల అయితే ఇద్దరు నిర్మాతలు నష్ట పోతారు కాబట్టి సామరస్యమైన చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి నిర్మాతలు ముందుకు వచ్చారు. వారిరువురిని అభినందిస్తున్నాను. ఇప్పుడు సమస్య సాల్వ్ అయింది. జనవరి 11న ” సరిలేరు నీకెవ్వరు”, 12న “అల వైకుంఠపురంలో ” చిత్రాలను రిలీజ్ చేసుకోవటానికి నిర్మాతలు అంగీకరించారు. ఇందుకు సహకరించిన నిర్మాతలిద్దరికీ ప్రొడ్యూసర్స్ గిల్డ్ పక్షాన థాంక్స్ చెబుతున్నాను”- అన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ” గతంలో కూడా ఇలాంటి సందర్భాలు ఎదురైనపుడు ఇలాగే సామరస్యంగా సమస్యను పరిష్కరించుకున్నాం. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో పరిష్కారం కుదిరింది. దీని ప్రకారం
జనవరి 11న” సరిలేరు నీకెవ్వరు”, 12న” అల వైకుంఠపురంలో” రిలీజ్ అవుతాయి. దీని పరిష్కారానికి చొరవ చూపిన ప్రొడ్యూసర్స్ గిల్డ్ కు కృతజ్ఞతలు”- అన్నారు.
సంక్రాంతికి విడుదల కానున్న 4 చిత్రాలు దర్బార్, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురం లో, ఎంత మంచి వాడవురా కు డిస్ట్రిబ్యూటర్ మీరే కదా అని అడగ్గా “అవును… ఇదొక ఎయిత్ వండర్” అన్నారు దిల్ రాజు.
ఒక డిస్ట్రిబ్యూటర్ గా ఈ నాలుగింటిలో ఏది పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నారు? అన్న ప్రశ్నకు” నాలుగు హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను” అన్నారు.
మొత్తానికి జటిలం అవుతుంది అనుకున్న సమస్య చాలా త్వరితంగా, సామరస్యంగా పరిష్కారం కావడంతో ఫిల్మ్ నగర్ వర్గాల ఉత్కంఠకు తెర పడింది. ఈ విషయంగా పెద్ద వివాదం జరుగుతుందని ఎదురుచూసిన వివాద ప్రియులకు మాత్రం నిరాశ ఎదురయింది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: