ప్రముఖ నవలారచయిత కల్కీ రాసిన నవల ఆధారంగా మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా.. పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తమిళ్ లో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమా ఇదే కావడంతో మణిరత్నం కూడా ఈ సినిమాలో నటించే నటీమణులను కూడా అంతే ప్రముఖులను సెలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. యువ స్టార్స్ నుంచి సూపర్స్టార్స్ వరకు పొన్నియన్ సెల్వన్ చిత్రంలో భాగం కాబోతున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటి ఐశ్వర్య రాయ్ కూడా నటిస్తున్న సంగతి విదితమే. అయితే తాజాగా ఐశ్వర్య పాత్రపై ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకొచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ ద్విపాత్రాభినయం చేయనున్నారని తెలుస్తోంది. వాటిలో ఒకటి నెగెటివ్ షేడ్స్ ఉన్న నందిని పాత్ర కాగా.. మరొకటి ఆమె తల్లి పాత్ర మందాకినీ దేవి పాత్ర. ఈ పాత్రకు సినిమాలో మాటలు ఉండవని కూడా తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇంకా ఈ సినిమాలో అనుష్క, జయం రవి, విక్రమ్, కీర్తి సురేష్, విజయ్ సేతుపతి, కార్తి, ఐశ్వర్య లక్ష్మి, మోహన్ బాబు లాంటి స్టార్లు నటించనున్నారు. మలయాళ నటుడు జయరాం, నటి అమలాపాల్, ఐశ్వర్యలక్ష్మి కూడా ముఖ్య పాత్రల్లో నటించనున్నట్లు తెలిసింది. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థలో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: