టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ ఇంట్లో విషాదం నెలకొంది. అలీ మాతృమూర్తి జైతన్ బీబీ (75) అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. రాజమండ్రిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించారు. రాజమండ్రిలో చనిపోవడంతో మృతదేహాన్ని గురువారం ఉదయం హైదరాబాద్ కు తీసుకొచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అలీ తల్లి జైతన్ బీబీ మరణ వార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ లోని అలీ ఇంటికి చేరుకుని పరామర్ళించారు. జైతన్ బీబీ పార్థివ దేహం వద్ద నివాళులర్పించారు. ఆమె విషయం తెలిసిన వెంటనే చిరంజీవి అలీ ఇంటికి బయలుదేరి వెళ్లారు. చాలాసేపు అక్కడే గడిపి అలీని ఓదార్చారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: