త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో ‘అల వైకుంఠపురములో’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో… ఇక ఒకపక్క షూటింగ్ జరుపుకుంటూనే మరో పక్క చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసింది చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత బన్నీ టాలెంటెడ్ డైరెక్టర్స్ సుకుమార్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఇప్పటికే ప్రారంభించారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను బన్నీ సైలెంట్ గా పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ‘అల వైకుంఠపురంలో’ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే బన్నీ సుకుమార్ సినిమాపై ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది.
కాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: