అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. గతకొద్ది కాలంగా ఈ సినిమా కేరళలో ఆఖరి షెడ్యూల్ ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ లాంగ్ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించారు చిత్ర యూనిట్. ఇక తాజా సమాచారం ప్రకారం ఆఖరి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకొని షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Started a memorable journey on July 5th And wrapped #SarileruNeekevvaru Shoot today, Dec 18th!!
This Sankranti will be as memorable one for all the movie lovers & Fans ♥January 11th 2020 🤟#SuperStarSankranthi pic.twitter.com/9PGqO7DsKM
— Anil Ravipudi (@AnilRavipudi) December 18, 2019
ఇక ఒకపక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క వెంట వెంటనే అప్ డేట్స్ ఇస్తూ ప్రమోషన్స్ లో ఇప్పటినుండే జోరు పెంచారు. టీజర్ ను, పాటలను రిలీజ్ చేస్తూ అప్ డేట్స్ ఇస్తున్నారు చిత్రయూనిట్.
కాగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన విడుదలచేయనున్నారు. ఇక మహేష్ మొదటిసారి ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండటంతో చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: