తమిళ్ సూపర్ స్టార్ రజినీ కాంత్, టాలీవుడ్ సూపర్ స్టార్ మధ్య యూ ట్యూబ్ వార్ ఏంటబ్బా అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. మహేష్ బాబు హీరో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశకు వచ్చిన ఈ సినిమా అప్పుడే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టేసింది. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా ప్రతి సోమవారం ఈ సినిమా నుండి ఒక్కో పాటను రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న ‘ హీ ఈజ్ సో క్యూట్’ అనే పాటను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెపెట్టేసింది. దీనిలో భాగంగానే ఈసినిమా ట్రైలర్ ను నిన్న రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
ఇక సరిలేరు నీకెవ్వరు సినిమాలోని ‘ హీ ఈజ్ సో క్యూట్’ పాట విడుదలైన కొద్దిసేపటికే దర్బార్ ట్రయిలర్ రిలీజ్ అవ్వగా రెండూ యూ ట్యూబ్ వద్ద వ్యూస్ తో పోటా పోటీగా దూసుకుపోతూ ట్రెండింగ్ లో నిలిచాయి. అయితే వ్యూస్ పరంగా మహేష్ సాంగ్ దర్బార్ తెలుగు ట్రైలర్ కంటే ఎక్కువ దక్కించుకుంది. సౌత్ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు సూపర్ స్టార్స్ యూట్యూబ్ లో తమ చిత్రాలకు సంబంధించిన వీడియోలతో ఒకే సమయంలో ఇలా పోటీపడటం ఆసక్తికరంగా మారింది.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమాలు సంక్రాంతి కి కూడా పోటీ పడనున్నాయి. తమిళంతో పాటు తెలుగు, హిందీలో జనవరి 9న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కూడా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 11వ తేదీన రిలీజ్ కానుంది. మరి చూద్దాం ఈ పొంగల్ వార్ లో ఏ సూపర్ స్టార్ నెగ్గుతాడో..!
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: