టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను తన అందం, అభినయం తో అలరిస్తున్న స్టార్ హీరోయిన్ కాజల్ అరుదైన గౌరవం అందుకున్నారు. పర్యాటకుల ఎట్రాక్షన్ కై దేశ ,విదేశాలలో మేడమ్ టుస్సాడ్స్ వాక్స్ మ్యూజియం లు ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యూజియం లలో రాజకీయ నాయకులు , మూవీ నటీనటులు, స్పోర్ట్స్ పర్సన్ ల మైనపు ప్రతిమలు కొలువుతీరతాయి. మేడమ్ టుస్సాడ్స్ వాక్స్ మ్యూజియం సెవెంత్ ఆసియన్ బ్రాంచ్ సింగపూర్ లో 2014సంవత్సరంలో ప్రారంభం అయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్ వాక్స్ మ్యూజియం లో కాజల్ అగర్వాల్ మైనపు ప్రతిమ కొలువుతీరనుంది. 2020 సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీ కాజల్ తన మైనపు ప్రతిమ ను తానే ఆవిష్కరించనున్నారు. అరుదైన గౌరవం అందుకొన్నందుకు కాజల్ ఇన్ స్టా గ్రామ్ ద్వారా తన ఆనందాన్ని ప్రకటించారు. సింగపూర్ లో మైనపు ప్రతిమను ఆవిష్కరించే గౌరవానికి సంతోషంగానూ, ఆత్రుత గానూ ఉందని కాజల్
పోస్ట్ చేశారు. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు ప్రతిమ సింగపూర్ మ్యూజియం లో కొలువుతీరిన విషయం తెలిసిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: