తెలుగుతో పాటు తమిళ్, హిందీ ఇలా పలు భాషల్లో సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది కీర్తిసురేష్. ప్రస్తుతం ఈ భామ హిందీలో అజయ్ దేవ్గణ్ హీరోగా నటిస్తోన్న ‘మైదాన్’ సినిమాలో నటిస్తోంది. దాంతో పాటు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఒక ఎమోషనల్ థ్రిల్లర్ సినిమాలో యాక్ట్ చేస్తోంది. వాటితో పాటు ‘మిస్ ఇండియా’ సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో ముఖ్యపాత్రలు పోషిస్తోంది. ఇక తాజాగా మరో బంపర్ ఆఫర్ ను కొట్టేసింది ఈ భామ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తమిళ్ సూపర్ స్టార్ రజినీ కాంత్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.అజిత్తో ‘వీరం’, ‘వేదాళం’, ‘వివేకం’, ‘విశ్వాసం’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన శివ కాంబినేషన్లో రజినీ ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో కీర్తి రజినీ సరసన ఎంపికైంది. ఇక ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ ఆనందాన్ని పంచుకుంది. నా సినీ కెరీర్ లో మరో మైల్ స్టోన్.. రజినీ సర్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న.. చాలా హ్యాపీ గా వుంది అని తన ట్వీట్ లో పేర్కొంది.
Extremely happy to announce this magical milestone in my journey .
From being awe struck of @rajinikanth sir to sharing screen space with him will be my most cherished memory in my life. Thank you @directorsiva sir @sunpictures 😊🙏🏻#Thalaivar168— Keerthy Suresh (@KeerthyOfficial) December 9, 2019
ఇప్పటికే ఎ.ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న రజినీ ‘దర్బార్’లో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 2020 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: