కుటుంబ బంధాలకు పెద్ద పీట వేసే దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. తొలి చిత్రం `నువ్వే నువ్వే` నుంచి గత చిత్రం `అరవింద సమేత` వరకు కథాంశం ఏదైనా, తన సినిమాల్లో కుటుంబ బంధాలు, విలువలకు చోటిచ్చారు త్రివిక్రమ్. ఈ నేపథ్యంలోనే… అప్ కమింగ్ ఫిల్మ్ `అల వైకుంఠపురములో` లోనూ ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ చుట్టూ ఫ్యామిలీ ఎమోషన్స్ ని జోడించారని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వినిపిస్తున్న కథనాల ప్రకారం…పేదింటి, పెద్దింటి పిల్లల తారుమారు కథతో `అల వైకుంఠపురములో` తెరకెక్కుతోందని తెలిసింది. తన కొడుకుని ధనవంతుల బిడ్డగా చూడాలని ఓ పేదింటి తండ్రి… హాస్పిటల్ లో చంటి పిల్లలను మార్చేస్తాడట. పర్యవసానంగా పేదింటి అబ్బాయి పెద్దింటిలోనూ… పెద్దింటి అబ్బాయి పేదింటిలోనూ పెరుగుతారు. ఈ నేపథ్యంలో సాగే కథతో `అల వైకుంఠపురములో` రూపొందుతుందని టాక్.
పేదింటిలో పెరిగే పెద్దింటి అబ్బాయిగా అల్లు అర్జున్ కనిపిస్తే… పెద్దింటిలో పెరిగే పేదింటి అబ్బాయిగా సుశాంత్ దర్శనమిస్తాడని వినికిడి. ఈ కథనాల్లో ఎంత నిజముందో తెలియాలంటే జనవరి 12వరకు వేచిచూడాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: