`డాన్ శీను`, `బలుపు` వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తరువాత మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న చిత్రం `క్రాక్`. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో రవితేజ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నారు. ఈ చిత్రంతోనే స్టన్నింగ్ బ్యూటీ శ్రుతి హాసన్ టాలీవుడ్ లో రీ-ఎంట్రీ ఇస్తోంది. అలాగే కోలీవుడ్ యాక్ట్రస్ వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ నెల 21 నుంచి `క్రాక్` రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం సినిమాలో కీలక సందర్భంలో వచ్చే జాతర సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రవితేజ, వరలక్ష్మి తదితరులపై ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలచే సీన్స్ లో ఇదొకటని టాక్.
`ఠాగూర్` మధు నిర్మిస్తున్న `క్రాక్`కి థమన్ బాణీలు అందిస్తున్నాడు. 2020 వేసవిలో ఈ సినిమా రిలీజ్ కానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: