కందిరీగ సినిమాతో సక్సెస్ఫుల్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యువ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా వస్తున్న సంగతి తెలిసిందే. ఇన్ని రోజులు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంది. ఇక తాజాగా ఈ సినిమా ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. నవంబర్ 29వ తేదీన ఉదయం 9.30 గంటలకు ఫిలిం నగర్ లోని రామ నాయుడు స్టూడియో లో లాంఛనంగా ప్రారంభించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాను సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా… డడ్లీ రాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాలో నటించే కథానాయిక, ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.
ఇదిలా ఉండగా ఈసినిమా కోసం సాయి తన లుక్ ను టోటల్ గా మార్చేశాడు. తాజాగా విడుదల చేసిన ఫోటోలో 8 ప్యాక్ బాడీ తో, ఫుల్ గడ్డంతో తన లుక్ ను డిఫరెంట్ గా మార్చేశాడు.
వరుస ప్లాప్స్ తో సతమతమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవలే తమిళ్ సూపర్ హిట్ మూవీ ‘రాచ్చసన్’ ను తెలుగులో ‘రాక్షసుడు’ పేరుతో రీమేక్ చేసి ఫైనల్ గా హిట్ కొట్టాడు. ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: