వైవిధ్యభరితమైన పాత్రలతో ముందుకు సాగుతోంది కథానాయిక రష్మికా మందణ్ణ. `ఛలో` నుంచి `డియర్ కామ్రేడ్` వరకు ఒకదానితో ఒకటి పొంతన లేని భూమికల్లో దర్శనమిచ్చిన ఈ కన్నడ కస్తూరి… చిత్రీకరణ తుది దశలో ఉన్న `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` చిత్రాల్లోనూ ఇదివరకు నటించని పాత్రల్లో కనిపించబోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అంతేకాదు… అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలోనూ రష్మిక ఓ డిఫరెంట్ రోల్ లో నటించబోతోందని సమాచారం. వినిపిస్తున్న కథనాల ప్రకారం… ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రష్మిక ఫారెస్ట్ ఆఫీసర్ గా కనిపిస్తుందని టాక్. సినిమాలో ఈ పాత్ర ఓ హైలైట్ గా నిలుస్తుందని వినికిడి. జనవరిలో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… 2020 చివరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కి దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: