విభిన్నమైన కథలను ఎంచుకొని వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ బాలీవుడ్ క్వీన్గా పేరు తెచ్చుకుంది కంగనా రనౌత్. ప్రస్తుతం ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఇప్పుడు కంగనా మరో డేరింగ్ స్టెప్ తీసుకున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే నటిగా, దర్శకురాలిగా సత్తా చాటిన ఆమె తాజాగా ఓ వైవిధ్యభరిత రామ మందిరం-బాబ్రీ మసీదు కథతో నిర్మాతగా మారబోతున్నట్టు తెలుస్తుంది. అయోధ్య ఇష్యూ గురించి ఐడియా వుండే ఉంటుంది కదా.. అయోధ్య వివాదంపై 134 సంవత్సరాలుగా వివాదం నడిచింది. కాగా, దీనిపై నవంబర్ 9వ తేదీన సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. వివాదానికి తెరపడటంతో ఇప్పుడు అక్కడ రామ్ మందిర్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇక ఇప్పుడు ‘అపరాజిత అయోధ్య’ పేరుతో రూపొందనున్న ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ నటి ‘రాణీ ఆఫ్ ఝాన్సీ’ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది. ఈ బ్యానర్ లో వస్తున్న మొదటి సినిమా ఇది. ఈ సినిమాకు కంగనా నిర్మాతగా వ్యవహరించనుంది. అంతేకాదు ఈ సినిమాకు ‘బాహుబలి’ రచయిత విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. గతంలో మణికర్ణిక, తలైవి సినిమాలకు కథను అందించాడు విజయేంద్రప్రసాద్. ఇప్పుడు మూడోసారి కలిసి పనిచేస్తున్నారు. ఈ సినిమాలో నాస్తికుడైన ఓ వ్యక్తి ఎలా భక్తుడిగా మారాడు అనే విషయాన్ని చెప్పబోతున్నారట. త్వరలోనే దర్శకుడు, నటీనటుల గురించి ప్రకటన వస్తుందని సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: