`సుప్రీమ్` తరువాత సాయితేజ్, రాశీఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం `ప్రతి రోజూ పండగే`. తాతమనవళ్ళ అనుబంధం నేపథ్యంలో సాగే ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని మారుతి తెరకెక్కిస్తున్నాడు. ఒక పాట మినహా ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ పూర్తయ్యింది. కాగా… ప్రస్తుతం మిగిలి ఉన్న ఆ గీతాన్ని హైదరాబాద్ లో షూట్ చేస్తున్నారు. సాయితేజ్, రాశీఖన్నాపై చిత్రీకరిస్తున్న ఈ యుగళగీతానికి శేఖర్ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చుతున్నాడు. కలర్ ఫుల్ గా సాగే ఈ పాట సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న `ప్రతిరోజూ పండగే`కి థమన్ బాణీలను అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























