యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో శర్వానంద్ హీరో గా రూపొందిన సక్సెస్ ఫుల్ మూవీ రన్ రాజా రన్ తో సుజీత్ దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమయ్యారు. సుజీత్ తనరెండవ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ లోనే రూపొందించారు. సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా 350కోట్ల బడ్జెట్ తో సాహో మూవీ రూపొందిన విషయం తెలిసిందే. ఈ మూవీ బాలీవుడ్ లో ఘనవిజయం సాధించింది. తెలుగు రాష్ట్రాలలో నిరాశ పరిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు సుజీత్ తన మూడవ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ లోనే శర్వానంద్ హీరోగా రూపొందించనున్నారని , శర్వానంద్ కు ఒక స్క్రిప్ట్ రెడీ చేశారని, త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం. హీరో శర్వానంద్ ప్రస్తుతం “శ్రీకారం ” మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత సుజీత్ దర్శకత్వంలో శర్వానంద్ నటించనున్నారని సమాచారం.ఒకే బ్యానర్ లోమూడు అవకాశాలను సుజీత్ పొందడం విశేషమే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: