వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనున్న సంగతి కూడా విదితమే. దీనికోసం ఓ మాజీ నక్సలైట్ తో ఆమెకు శిక్షణ తీసుకుంటున్నట్టు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. ప్రస్తుతం సాయి పల్లవి షూటింగ్ లో పాల్గొంటుండగా.. జనవరి నుండి రానా షూటింగ్ లో పాల్గొననున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కెమెరామన్ మారినట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా దివాకర్ మణి చేస్తున్నాడు. అయితే డైరెక్టర్ కు దివాకర్ కు మధ్య విభేదాలు రావడంతో కెమెరామెన్ ను మార్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దివాకర్ ప్లేస్ లో ‘మహానటి’కి కెమెరామెన్ గా పనిచేసిన విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘డాని సాంచెజ్ లోపెజ్’ ఈ సినిమాకి కెమెరామెన్ గా పని చేయబోతున్నారట.
కాగా ఇంకా ఈసినిమాలో నందితా దాస్, ప్రియమణి, ఈశ్వరీ రావ్,జరీనా వహాబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. 1990 ల నాటి సామజిక పరిస్థితుల ఆధారం గా రూపొందుతున్న ఈ మూవీని ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ పై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: