`బాహుబలి` సిరీస్లో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా రెండు విభిన్న పాత్రల్లో నటించి అలరించాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. తండ్రీకొడుకుల పాత్రల్లో వైవిధ్యాన్ని ప్రదర్శించి మరీ బ్లాక్బస్టర్స్ అందుకున్నాడీ హ్యాండ్సమ్ హీరో. కట్ చేస్తే… తన అప్ కమింగ్ ఫిల్మ్లోనూ ఇదే ఫీట్ ని రిపీట్ చేయబోతున్నాడట ప్రభాస్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ప్రభాస్, పూజా హెగ్డే జంటగా ‘జిల్’ రాధాకృష్ణ ఓ పిరియాడికల్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలోనే ప్రభాస్ తండ్రీకొడుకులుగా మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని టాక్. అయితే, `బాహుబలి`లో రెండు పాత్రలు కలిసే సందర్భాలు ఉండవు. రాబోయే చిత్రంలో మాత్రం రెండు పాత్రలు ఒకేసారి తెరపై దర్శనమిచ్చే సన్నివేశాలు ఉంటాయని సమాచారం. ఏదేమైనా, ప్రభాస్ ద్విపాత్రాభినయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
కాగా… ఈ నెల 18 నుంచి నెక్ట్స్ షెడ్యూల్ జరుపుకోనున్న `ప్రభాస్ 20`… 2020 ద్వితీయార్ధంలో థియేటర్లలో సందడి చేయనుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: