‘118’ లాంటి డిఫరెంట్ కథతో మంచి హిట్ కొట్టాడు నందమూరి కల్యాణ్రామ్. ప్రస్తుతం సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నటిస్తున్న కల్యాణ్రామ్ సినిమా ‘ఎంత మంచివాడవురా’. ఈ సినిమా షూటింగ్ చివరిదశకు వచ్చింది. కేరళలోని మున్నార్ తదితర సుందరమైన ప్రదేశాల్లో చివరి షెడ్యూల్ జరుపుకుంటుంది. శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాను జనవరి 15వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు మరో విభిన్నమైన స్టోరీని లైన్లో పెట్టాడట కళ్యాణ్ రామ్. టైం మిషన్ కాన్సెప్ట్ తో బాలకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఆదిత్య 369’ అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో తెలుసుకదా. ఈ మధ్య ఆ సినిమా సీక్వెల్ కూడా తెరకెక్కించాలని చూసారు. కానీ అది వర్కౌట్ కాలేదు. అయితే ఇప్పుడు అదే తరహా కాన్సెప్ట్ తో కళ్యాణ్ రామ్ ఒక సినిమాను తీయాలని చూస్తున్నాడట. ఈ సినిమాకి మల్లిడి వేణు దర్శకత్వం వహించనున్నట్టుగా సమాచారం. 500 ఏళ్లకి ముందు కథ .. ఆ తరువాత కథగా ఈ సినిమా సాగుతుందని అంటున్నారు. భారీ బడ్జెట్ తోనే ఈ సినిమాను పట్టాలెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: