అనిల్ పాడూరి దర్శకత్వంలో పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా ‘రొమాంటిక్’ మూవీ రూపొందుతున్న తెలిసిందే. స్టోరీ, స్క్రీన్ ప్లే , డైలాగ్స్ పూరి అందించిన ఈ సినిమా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాలో మందిరా బేడీ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు మరో వార్త బయటకి వచ్చింది. మందిరా బేడీ పాత్రలో రమ్యకృష్ణను తీసుకున్నారట. మందిరా బేడీ చేసిన సీన్స్ రషెస్ చూసిన యూనిట్ కి ఆ సీన్స్ అంత బాగా వచ్చినట్టు అనిపించలేదంటా. దీనితో వెంటనే రమ్యకృష్ణ ని సంప్రదించి.. ఆమెతో మందిరా బేడీ నటించిన సీన్స్ అన్నిటిని రీ షూట్స్ చేస్తున్నట్లుగా సమాచారం. మరి ఇది నిజమేనా..?లేకపోతే రమ్యకృష్ణ, మందిరా ఇద్దరూ సినిమాలో ఉన్నారా..? లేక నిజంగానే మందిరా ప్లేస్ లోకి రమ్య ను తీసుకొచ్చారా..? వీటిపై క్లారిటీ రావాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
కాగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆకాష్ సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో మకరంద్ దేశ్ పాండే, ఉత్తేజ్, సునైన,దివ్యదర్శిని తదితరులు ఈ చ్రితంలో నటిస్తున్నారు. టూరింగ్ టాకీస్ బ్యానర్ పై పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్ ,ఛార్మి ) బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. నరేశ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. మరి తనయుడి హిట్ కోసం పూరి ఎప్పటినుండో ఎదురుస్తున్నాడు. మరి ఈ సినిమాతో అయినా ఆకాష్ హిట్ కొడతాడేమో చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: