మెగా ఫ్యామిలీకి అచ్చొచ్చిన నిర్మాణ సంస్థల్లో హ్యాట్రిక్ విజయాల సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ‘రంగస్థలం’ వంటి మెమరబుల్ బ్లాక్బస్టర్ని అందించిన మైత్రీ… ఆపై వరుస పరాజయాల్లో ఉన్న మరో మెగాహీరో సాయితేజ్ కి ‘చిత్రలహరి’ రూపంలో విజయాన్ని అందించింది. అంతేకాదు… సాయితేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్ ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ ప్రస్తుతం ‘ఉప్పెన’ అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమాని ప్రొడ్యూస్ చేస్తోంది మైత్రీ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా… మెగా, మైత్రీ బంధం ఇక్కడితో ఆగిపోవడం లేదట. మెగాస్టార్ చిరంజీవితోనూ ఓ సినిమా చేయడానికి ఈ క్రేజీ ప్రొడక్షన్ హౌస్ ప్లాన్ చేస్తోందట. `రంగస్థలం`తో చిరు మనసును దోచుకున్న సుకుమార్ దర్శకత్వంలోనే ఈ చిత్రం ఉండొచ్చని సమాచారం. అంతేకాదు… ఒకవేళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ ఇస్తే తనతోనూ ఓ భారీ బడ్జెట్ మూవీని నిర్మించాలని మైత్రీ ప్లాన్ చేస్తోంది. వాస్తవానికి, `అజ్ఞాతవాసి` తరువాత పవన్ `మైత్రీ` సంస్థలో ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే, పవన్ పూర్తిగా రాజకీయాలవైపు దృష్టి పెట్టడంతో… అది కార్యరూపం దాల్చలేదు. ఒకవేళ రీ-ఎంట్రీ ఇస్తే మైత్రీతో పవన్ సినిమా పక్కా అనుకోవచ్చు.
మొత్తమ్మీద… `మెగా` కాంపౌండ్తో `మైత్రీ` బంధం మరింత పటిష్టం కానుందన్నమాట. రాబోయే `మెగా` కాంపౌండ్ చిత్రాలతోనూ మైత్రీ మూవీ మేకర్స్ విజయాలు అందుకోవాలని ఆశిద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: