దీపావళి కానుకగా విడుదలైన ‘ఖైదీ’తో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు కార్తి. తమిళ, తెలుగు భాషల్లో ఒకే రోజున రిలీజైన ఈ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ అయింది. కాగా, ఒకవైపు `ఖైదీ` విజయాన్ని ఆస్వాదిస్తూనే… మరోవైపు తదుపరి చిత్రాన్ని పూర్తిచేసే పనిలో ఉన్నాడు కార్తి. అంతేకాదు… ఫ్యామిలీ థ్రిల్లర్గా రానున్న ఈ సినిమా కూడా ఈ ఏడాదిలోనే తెరపైకి రానుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… మలయాళ చిత్రం `దృశ్యం`(2013)తో పాటు ఆ సినిమా తమిళ వెర్షన్ `పాపనాశం`(2015)కి కూడా దర్శకత్వం వహించిన జీతూ జోసఫ్ డైరెక్షన్లో కార్తి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘తంబి’ (`తమ్ముడు` అని అర్థం) అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. అక్కాతమ్ముళ్ళ సెంటిమెంట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో కార్తికి అక్కగా టాలెంటెడ్ యాక్ట్రస్ జ్యోతిక(రియల్ లైఫ్లో కార్తికి వదిన) నటిస్తోంది. అలాగే… సత్యరాజ్, నిఖిలా విమల్, అమ్ము అభిరామి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వయాకామ్ 18 స్టూడియోస్, పారలల్ మైండ్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ తమిళ చిత్రాన్ని… క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా… తెలుగులోనూ `దొంగ` పేరుతో ఈ సినిమా అదే రోజున అనువాదం కానుందని సమాచారం.
మరి… `ఖైదీ`తో మళ్ళీ సక్సెస్ ట్రాక్లోకి వచ్చేసిన కార్తి… కొత్త చిత్రంతోనూ ఆ పరంపరని కొనసాగిస్తాడేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: