ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్… తెలుగునాట పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా ‘సరిలేరు నీకెవ్వరు’ని నిర్మిస్తోంది ఈ సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ హౌస్ . ఈ సినిమా సెట్స్పై ఉండగానే… మహేష్తోనే మరో చిత్రాన్ని నిర్మించే అవకాశాన్ని దక్కించుకుందని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ‘కె.జి.ఎఫ్’తో సంచలన విజయాన్ని అందుకున్న ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మహేష్ ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా… ఈ క్రేజీ ప్రాజెక్ట్ను ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించబోతున్నట్లు సమాచారం. అంతేకాదు… ఈ చిత్రానికి మహేష్ నిర్మాణ భాగస్వామిగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం మహేష్ ‘సరిలేరు…’తోనూ, ప్రశాంత్ ‘కె.జి.ఎఫ్ 2’తోనూ బిజీగా ఉన్న నేపథ్యంలో… సదరు చిత్రాలు పూర్తైన వెంటనే మహేష్, ప్రశాంత్ కాంబినేషన్ మూవీ పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడుతుందేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: