మ‌హేష్ త‌దుప‌రి చిత్రాన్ని నిర్మించ‌నున్న ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌?

ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్… తెలుగునాట‌ ప‌లు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ‌ సంస్థ. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా ‘సరిలేరు నీకెవ్వరు’ని నిర్మిస్తోంది ఈ స‌క్సెస్‌ఫుల్ ప్రొడ‌క్ష‌న్ హౌస్‌ . ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే… మహేష్‌తోనే మ‌రో చిత్రాన్ని నిర్మించే అవకాశాన్ని దక్కించుకుందని టాక్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… ‘కె.జి.ఎఫ్’తో సంచలన విజయాన్ని అందుకున్న ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో మహేష్ ఓ సినిమా చేయబోతున్నట్లు వార్త‌లు వినిపిస్తున్న‌ సంగతి తెలిసిందే. కాగా… ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌ నిర్మించబోతున్న‌ట్లు స‌మాచారం. అంతేకాదు… ఈ చిత్రానికి మహేష్ నిర్మాణ భాగస్వామిగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం మహేష్ ‘సరిలేరు…’తోనూ, ప్రశాంత్ ‘కె.జి.ఎఫ్ 2’తోనూ బిజీగా ఉన్న నేపథ్యంలో… సదరు చిత్రాలు పూర్తైన వెంటనే మహేష్, ప్రశాంత్ కాంబినేష‌న్ మూవీ పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడుతుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + thirteen =