మాస్ మహారాజా రవితేజ… ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో ఒకటి వి.ఐ.ఆనంద్ డైరెక్షన్లో రూపొందుతున్న ‘డిస్కోరాజా’(డిసెంబర్ 20న విడుదల) కాగా… మరొకటి గోపీచంద్ మలినేని కాంబినేషన్ మూవీ. ఈ రెండు సినిమాలు చేతిలో ఉండగానే… తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట రవితేజ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ‘నేను లోకల్’ వంటి విజయవంతమైన చిత్రానికి కథను అందించిన ప్రసన్న కుమార్ బెజవాడ… తాజాగా రవితేజ కోసం ఓ కథను సిద్ధం చేసాడని సమాచారం. హాస్యప్రధానంగా సాగే ఈ కథకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని… ఇందులో రవితేజ క్యారెక్టర్ మంచి కామెడీ టైమింగ్తో ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు… ఈ చిత్రాన్ని త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేస్తాడని తాజా ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించాడు రచయిత ప్రసన్న. మరి… గతంలో ‘సినిమా చూపిస్త మావ’, ‘నేను లోకల్’ వంటి కామెడీ ఎంటర్టైనర్స్తో విజయాలు అందుకున్న త్రినాథ్… రవితేజ కాంబినేషన్లోనూ ఆ ఫీట్ ని రిపీట్ చేస్తాడేమో చూడాలి.
కాగా… ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: