మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్గా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవలే పూజ జరుపుకున్న ఈ సినిమా… డిసెంబర్ తొలి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. అంతేకాదు… ప్రస్తుతం కోకాపేట్లో ఓ కాలనీ సెట్ వేస్తున్నారని, అక్కడే పాటతో చిత్రీకరణకు శ్రీకారం చుడతారని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా… ఇందులో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉద్యోగిగా చిరు కనిపించనున్నారని, వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోందని ప్రచారం సాగుతోంది. గతంలో చోటుచేసుకున్న సింహాచల దేవస్థాన భూముల కబ్జా ఆధారంగా కొరటాల ఈ చిత్ర కథను అల్లుకున్నాడట. ఈ నేపథ్యంలో… గుడిమాన్యాలను కాజేసే అక్రమార్కుల భరతం పట్టే వ్యక్తిగా చిరు దర్శనమిస్తారని సమాచారం. మరి… మరోసారి మెసేజ్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్తో రాబోతున్న కొరటాల… చిరు కాంబినేషన్ మూవీతో ఏ స్థాయి విజయాన్నిఅందుకుంటాడో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: