యువ కథానాయకుడు రాజ్ తరుణ్, అందాల తార షాలిని పాండే జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్కు జి.ఆర్.కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాని నవంబర్ 9న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే, ఇప్పుడీ చిత్రాన్ని డిసెంబర్ 25కి వాయిదా వేసే దిశగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే విడుదల తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా, కెరీర్ ఆరంభంలో `హ్యాట్రిక్ హీరో` అనిపించుకున్న రాజ్ తరుణ్… ఆ తరువాత ఆ స్థాయి విజయాలను అందుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో… ‘ఇద్దరి లోకం ఒకటే’ చిత్రమైనా రాజ్ తరుణ్ కెరీర్కు ప్లస్ అవుతుందేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: