హిందీలో వచ్చిన ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయింది. ఇక లస్ట్ స్టోరీస్ కథ విషయానికి వస్తే నలుగురు జంటల మధ్య వారి ప్రయాణానికి సంబంధించింది. కియారా అద్వానీ, రాధికా ఆప్టే, భూమి పెడ్నేకర్ మరియు మనీషా కొయిరాలా నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ ను తెలుగులో రీమేక్ చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. లస్ట్ స్టోరీస్ ని మన తెలుగు వారి నేటివిటీ కి తగ్గట్టుగా అందించాలని నిర్మాత ‘రోని స్క్రూవాలా’ నిర్ణయించుకున్నారు. అంతేకాదు ఇప్పటీకే ఈ వెబ్ సిరీస్ లో అమలా పాల్ కూడా నటించనున్నట్టు టాక్స్ వినిపించాయి. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలో మరో పేరు తెరపైకి వచ్చింది. అదే ఈషా రెబ్బ. సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ సిరీస్ లో ఈషా రెబ్బ ఒక లీడ్ రోల్ లో నటించనుందట. డైరెక్టర్ తనకు ఈ రీమేక్ గురించి చెప్పినవెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట ఈషా. మరి దీనిపై మరింత సమాచారం తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
కాగా “అంతకు ముందు ఆ తర్వాత ” తో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సినిమాలో హీరోయిన్ గా నటించినా మంచి బ్రేక్ రాలేదని చెప్పొచు. ఇక ప్రస్తుతం ఈషా శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో ‘రాగల 24 గంటల్లో’ అనే లేడీ ప్రాధాన్యత ఉన్న సినిమాలో నటించింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. సత్యదేవ్, తమిళ నటుడు శ్రీరామ్, ముస్కాన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను…శ్రీ నవహాస్ క్రియేషన్స్ నిర్మాణంలో శ్రీనివాస్ కానూరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది కాకుండా తమిళ లో ఒక సినిమా, కన్నడ లో కూడా ఒక సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: