యంగ్ టైగర్ యన్టీఆర్… ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మెరుపువేగంతో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ పేట్రియాటిక్ డ్రామా… 2020 జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే… ఈ సినిమా సెట్స్పై ఉండగానే… మరో క్రేజీ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు తారక్. ‘కేజీఎఫ్’ వంటి బ్లాక్బస్టర్ మూవీని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ డ్యాన్స్ బేస్డ్ మూవీ చేయనున్నాడు తారక్. ‘ఆర్ ఆర్ ఆర్’ పూర్తైన వెంటనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అదేమిటంటే… హ్యాట్రిక్ మూవీస్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్లో… తారక్కు జోడిగా ‘ఛలో’ బ్యూటీ రష్మిక మందన్న ఎంపికైందని సమాచారం. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘సరిలేరు నీకెవ్వరు’లోనూ … స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (సుకుమార్ directorial) కొత్త చిత్రంలోనూ కథానాయికగా నటించే అవకాశాన్ని ఒడిసిపట్టుకున్న రష్మిక… ఇప్పుడు ఇదే వరుసలో తారక్తోనూ కలిసి నటించే అవకాశాన్ని అందిపుచ్చుకోవడం వార్తల్లో నిలుస్తోంది. కాగా… త్వరలోనే తారక్ – ప్రశాంత్ కాంబినేషన్ మూవీలో రష్మిక ఎంట్రీపై క్లారిటీ రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: