2019… దిగ్గజ నటుడు మోహన్ బాబుకు వెరీ స్పెషల్ ఇయర్. ఎందుకంటే… దాదాపు నాలుగు దశాబ్దాల విరామం అనంతరం మళ్ళీ స్ట్రయిట్ తమిళ పిక్చర్స్లో నటిస్తున్నారాయన. అంతేకాదు… భారీ చిత్రాలుగా తెరకెక్కుతున్న ఈ రెండు సినిమాలను కూడా గురుశిష్యులే డైరెక్ట్ చేస్తుండడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం వద్ద ఏడు సంవత్సరాలు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన లేడీ డైరెక్టర్ సుధా కొంగర (‘గురు’ ఫేమ్)… ప్రస్తుతం ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ జి.ఆర్.గోపీనాథ్ జీవితం ఆధారంగా `సూరరై పోట్రు` అనే బయోగ్రాఫికల్ ఫిల్మ్ని రూపొందిస్తున్నారు. ఇందులో సూర్య కథానాయకుడిగా నటిస్తుండగా… మోహన్ బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. క్రిస్మస్కి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక భారీ తారాగణంతో మణిరత్నం తెరకెక్కించబోతున్న నవల బేస్డ్ హిస్టారికల్ ఫిల్మ్ ‘పొన్నియిన్ సెల్వన్’లో కూడా మోహన్ బాబు ఓ ముఖ్య పాత్రలో దర్శనమివ్వనున్నారు. డిసెంబర్ నుంచి పట్టాలెక్కనున్న ఈ హిస్టారికల్ డ్రామాలో… మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్కు భర్తగా నటించనున్నారు మన కలెక్షన్ కింగ్.
మరి… విలక్షణమైన నటనకు చిరునామాగా నిలిచే మోహన్ బాబు… ఈ రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్తో తమిళ్ ఆడియన్స్ను ఏ స్థాయిలో అలరిస్తారో చూడాలి. కాగా… ఈ రెండు సినిమాలు కూడా తెలుగులోనూ అనువాద రూపంలో సందడి చేయనున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























