ప్రేమ ఇష్క్ కాదల్, ఎవడే సుబ్రహ్మణ్యం వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో నటించిన హైదరాబాద్ గర్ల్ రీతూవర్మ, విజయ్ దేవరకొండ జంటగా రూపొందిన పెళ్ళి చూపులు మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ లో పెర్ఫార్మెన్స్ కు రీతూ వర్మ బెస్ట్ యాక్ట్రెస్ గా నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. కోలీవుడ్ లో హీరోయిన్ గా కొనసాగుతున్న రీతూ వర్మ మూడు సంవత్సరాల తరువాత ఒక తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై శర్వానంద్, రీతూ వర్మ జంటగా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషలలో రూపొందుతున్న మూవీ షూటింగ్ క్రిందటి వారం ప్రారంభమయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పెళ్ళి చూపులు మూవీ తరువాత తెలుగు మూవీస్ లో ఆఫర్స్ వచ్చినా తన మనసుకు నచ్చిన, తాను చేయాలనుకొనే పాత్రల స్క్రిప్ట్స్ రాలేదని, అందుకే తెలుగు మూవీస్ లో నటించలేదని రీతూ వర్మ చెప్పారు. దర్శకుడు శ్రీ కార్తీక్ నరేట్ చేసిన స్క్రిప్ట్ కు మరో ఆలోచనలేకుండా ఓకే చేశానని, యంగ్ డైరెక్టర్స్ కొత్త ఐడియాలతో వస్తున్నారని, అందుకే ఈ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని, లవ్, రిలేషన్ షిప్, ఫ్రెండ్ షిప్ నేపథ్యం లో ఈ మూవీ ఎంటర్ టైనర్ గా రూపొందుతుందని, ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని, తెలుగు, తమిళ భాషలలో ఏక కాలం లో చిత్రీకరణ జరుగుతుందని, ప్రస్తుతం చెన్నై లో షూటింగ్ జరుగుతుందని, తెలుగు వెర్షన్ లో వెన్నెల కిషోర్, ప్రియదర్శి నటిస్తున్నారని, షూటింగ్ టైమ్ లో ఎంజాయ్ చేస్తున్నామని, ఆసక్తికర యాంగిల్స్ ఉన్న వర్కింగ్ ఉమెన్ గా నటిస్తున్నానని, ఈ మూవీ ప్రేక్షకులను అలరించనుందని రీతూ వర్మ తెలిపారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: