అడివి శేష్, రెజీనా జంటగా వెంకట్ రామ్ జీ దర్శకత్వం లో PVP బ్యానర్ పై రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ఎవరు మూవీ ఆగస్ట్ 15 వ తేదీ రిలీజయి పాజిటివ్ టాక్ తో, రికార్డ్ కలెక్షన్స్ తో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ లతో ఆకట్టుకున్న ఎవరు మూవీ అంచనాలకు తగ్గట్టుగానే విజయం సాధించి ప్రేక్షకాదరణ పొందింది. అడివి శేష్, రెజీనా, నవీన్ చంద్ర అద్భుతం గా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎవరు మూవీ ని వీక్షించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆ చిత్ర యూనిట్ ను అభినందించారు. ఎవరు మూవీ టీమ్ కు కంగ్రాట్స్. ట్విస్ట్, టర్న్ లతో సాగిన మర్డర్ మిస్టరీ ఎవరు మూవీ బాగుందని, రైటింగ్ పరంగా, సాంకేతిక పరంగా మూవీ చాలా బాగుందని, హీరో శేష్ వరుసగా ప్రేక్షకులను ఆకట్టుకునే మూవీస్ లో నటిస్తున్నారని, హ్యాట్రిక్ సాధించారని, రెజీనా, నవీన్ చంద్ర, మురళీశర్మ చక్కగా పెర్ఫార్మ్ చేశారని, నిర్మాత పివిపి, దర్శకుడు వెంకట్ రామ్ జీ కి అభినందనలు అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.
CONGRATULATIONS to the entire team of EVARU . @AdiviSesh @ReginaCassandra pic.twitter.com/PS08Kxrne4
— Allu Arjun (@alluarjun) August 19, 2019
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: