సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో క్లాసిక్గా నిలచిన చిత్రం ‘అతడు’. అంతేకాదు… ‘నిజం’ తరువాత “ఉత్తమ నటుడు”గా మహేష్కు మరోసారి “నంది” పురస్కారాన్ని అందించిన సినిమా ఇది. ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో… మహేష్ సరసన త్రిష కథానాయికగా నటించింది. నాజర్, కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్, తనికెళ్ళ భరణి, సుధ, గిరిబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం, హేమ, సోనూ సూద్, రాజీవ్ కనకాల తదితరులు ముఖ్య భూమికలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“మెలోడీ బ్రహ్మ” మణిశర్మ సంగీత సారథ్యంలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ఇక మణి అందించిన నేపథ్య సంగీతం సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్ళింది. ప్రముఖ నిర్మాణ సంస్థ జయభేరి ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని… హిందీలో ‘ఏక్’ పేరుతోనూ, బెంగాలీలో ‘వాంటెడ్’ పేరుతోనూ రీమేక్ చేసారు. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్… మూడు “నంది” అవార్డులతో పాటు పలు ప్రాంతీయ పురస్కారాలను కూడా సొంతం చేసుకుంది. 2005 ఆగస్టు 10న విడుదలైన ‘అతడు’… నేటితో 14 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
[subscribe]
[youtube_video videoid=GTagL0R1QLc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: