ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా గా పేరుపొందిన దాదా సాహెబ్ ఫాల్కే భారతీయ చిత్ర పరిశ్రమలో మొదటి సినిమా రాజా హరిశ్చంద్ర మూవీ (1913 )కి దర్శకత్వం వహించి నిర్మించారు. 1870 నుండి 1944 సంవత్సరం వరకు ఆయన చిత్ర పరిశ్రమకు చేసిన సేవల జ్ఞాపకార్ధం మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ &బ్రాడ్ కాస్టింగ్ ఆధ్వర్యం లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ను 1969 సంవత్సరం లో ప్రవేశపెట్టింది. నేషనల్ అవార్డ్స్ తో పాటు ఈ అవార్డ్ ను ప్రెజెంట్ చేస్తారు. 1969 సంవత్సరం లో జరిగిన 17వ ఇంటర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో 10 సంవత్సరాల సినీ కెరీర్ లో సక్సెస్ ఫుల్ గా రాణించిన, ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియన్ సినిమాగా పేరుపొందిన యాక్ట్రెస్ దేవికారాణి మొదటి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ను అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హైదరాబాద్ లో సెప్టెంబర్ 20 వ తేదీ దాదా సాహెబ్ ఫాల్కే దక్షిణ భారత అవార్డ్ వేడుక జరుగనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పాల్గొంటారు. ఈ వేడుక లో దక్షిణాది చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులను సత్కరిస్తారని సమాచారం. అనుష్క, సమంత, రకుల్ ప్రీత్, నందిత శ్వేత, పాయల్ రాజ్ పుత్, ఛార్మి, లక్ష్మి మంచు, పూరి జగన్నాథ్, దేవిశ్రీ ప్రసాద్ , మోహన్ బాబు, జగపతి బాబు, బ్రహ్మానందం ఈ వేడుకకు హాజరు కానున్నారు. బాలీవుడ్ లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ వేడుక రీసెంట్ గా జరిగిందని, హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకం గా నిర్వహిస్తామని వేడుక నిర్వాహకులు తెలిపారు.
[youtube_video videoid=mcAMIkNJIgE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: