కింగ్ నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మన్మథుడు 2’. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో… ‘వెన్నెల’ కిషోర్, లక్ష్మి, రావు రమేష్, ఝాన్సీ ఇతర ముఖ్య భూమికలను పోషించారు. సమంత, కీర్తి సురేష్, అక్షర గౌడ అతిథి పాత్రలలో దర్శనమివ్వనున్నారు. ‘మన్మథుడు’కి మరో వెర్షన్గా వస్తున్న ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్కి ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ చైతన్ భరద్వాజ్ బాణీలు అందించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ కమిటీ ఈ మూవీకి `యు/ఎ` సర్టిఫికేట్ జారీ చేసింది. 2 గంటల 35 నిమిషాల నిడివితో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిసింది. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ‘మన్మథుడు 2’… ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
[youtube_video videoid=CXytlSeigKo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: